దివంగత మహానేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితకథ ఆధారంగా డైరెక్టర్ మహి వి.రాఘవ్ `యాత్ర` అనే సినిమాను తిసిన విషయం తెలిసిందే. వై.ఎస్.ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారు. ఇప్పుడు ఈ దర్శకుడు `యాత్ర 2` చేయాలనుకుంటున్నాడా? అంటే అవుననే ఇండస్ట్రీ నుండి సమాధానం వస్తుంది. ఈ దర్శకుడు రీసెంట్గా జరిగిన ఎన్నికల ఫలితాల్లో విజయం సాధించిన జగన్ను ఉద్దేశిస్తూ చేసిన అభినందన ట్వీట్లో హాష్ ట్యాగ్ `యాత్ర 2` అని జత చేశారు.'మీరు భవిష్యత్ తరాలకు చెప్పాల్సినంత గొప్ప విజయాన్ని అందించారు అంటూ ట్వీట్ చేశారు. వైఎస్ఆర్ అకాల మరణాన్ని తట్టుకోలేక ఎంతో మంది అభిమానులు గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే. వారి కుటుంబాలను ఓదార్చేందుకు వైఎస్ జగన్ ఏపీలో పాదయాత్ర నిర్వహించారు. దీని ఆధారంగా సినిమా ఉంటుందట. జగన్ పాదయాత్ర నుండి 2019లో జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే వరకు చోటు చేసుకున్న పరిణామాలను ఫోకస్ చేస్తూ 'యాత్ర 2' ఉంటుందని టాక్. అయితే యాత్ర 2 ఎప్పుడు వస్తుందనే విషయాలను మాత్రం మహి వి రాఘవ్ తెలుపలేదు.