నేడు ప్రిన్స్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మాణమైన ఈ చిత్రాన్ని 2 వేల 500 థియేటర్లలో విడుదల చేశారు. మహేష్ బాబుతో పాటు పూజా హెగ్డే, అల్లరి నరేష్ నటించిన ఈ చిత్రంపై అభిమానుల్లో ప్రత్యేక క్రేజ్ నెలకొంది. బెన్ఫిట్ షో కోసం అభిమానులు భారీగా తరలివచ్చారు. ఇదిలాఉంటే రాజమహేంద్రవరంలో మహేష్ బాబు అభిమాని ఘోరప్రమాదం చోటుచేసుకుంది. మహేష్ బాబు ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ గురై అభిమాని మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం మండలం ధవళేశ్వరంలో బుధవారం అర్ధరాత్రి జరిగింది.
ఇండస్ట్రియల్ కాలనీకి చెందిన హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి యర్రంశెట్టి రాజీవ్ (27) మహర్షి సినిమా విడుదల సందర్భంగా ఐరన్ ఫ్రేమ్తో కూడిన భారీ ఫ్లెక్సీ కట్టేందుకు మరో వ్యక్తితో కలసి మురళీకృష్ణ థియేటర్ పక్కన బిల్డింగ్పైకెక్కాడు అయితే ఫ్లెక్సీ ఫ్రేమ్ విద్యుత్ వైర్లకు తగలడంతో కరెంట్ షాక్ తగిలి రాజీవ్ ఒక్కసారిగా బిల్డింగ్పై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడిన రాజీవ్ని 108లో రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే మరణించాడు.