లతా మంగేష్కర్‌కు కరోనా నిర్ధారణ.. ఐసీయూలో కొనసాగుతున్న చికిత్స...

Latha Mangeshkar: మరో 12 రోజుల పాటు వైద్యు పరిశీలనలో లతా మంగేష్కర్

Update: 2022-01-12 08:24 GMT

లతా మంగేష్కర్‌కు కరోనా నిర్ధారణ: ఐసీయూలో కొనసాగుతున్న చికిత్స

Latha Mangeshkar: ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం లతా మంగేష్కర్‌కు కరోనా నిర్ధారణ కాగా ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వివరాలు తెలిపరు. ప్రస్తుతం లతా మంగేష్కర్‌ ఐసీయూలోనే ఉన్నారని, 10 నుంచి 12 రోజుల పాటు వైద్యుల పరిశీలనలోనే ఉంటారని చెప్పారు. ఆమె కరోనాతో పాటు న్యూమోనియాతో బాధ‌ప‌డుతున్నార‌ని వైద్యుడు ప్రతీత్ సంధాని తెలిపారు. ల‌తా మంగేష్కర్ 2019లోనూ శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరి, చికిత్స తీసుకుని కోలుకున్నారు.

Tags:    

Similar News