వైసీపీ అధికారంలోకి రాకపోయినా... : లగడపాటి

Update: 2019-05-19 13:44 GMT

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా సీట్లు గణనీయంగా రావొచ్చని లగడపాటి రాజగోపాల్ చెప్పుకొచ్చారు. ఆదివారం సాయంత్రం ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించారు. ఏపీలో టీడీపీకి మరోసారి అవకాశం ఇవ్వాలన్న కోరికతో ఏపీ ప్రజలున్నారని, ఇక వైసీపీ ప్రతిపక్షంగా గట్టి పోటీ ఇచ్చిందని అధికారంలోకి రాకపోయిన సీట్లు గణనీయంగా రావొచ్చన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మూడోస్థానంలో ఉందని లగడపాటి తేల్చిచెప్పారు. జనసేన ఒక్కో జిల్లాలో ఒక్కోలా ప్రభావం చూపిందని లగడపాటి తెలిపారు. ఆంధప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జయకేతనం ఎగురవేయనున్నట్లు లగడపాటి ఎగ్జిట్‌పోల్స్‌ చెబుతున్నాయి. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ తాజా ఎన్నికల్లో టీడీపీకి 100కు పది సీట్లు అటు ఇటూగా వస్తాయని తెలిపారు. ఇక వైసీపీకి 72 స్థానాలకు పది అటు ఇటూగా వస్తాయన్నారు. ఇక జనసేనతో పాటు ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించవచ్చని అంచనా వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీకి 13 నుంచి 17 సీట్లు, వైసీపీకి 8 నుంచి 12, ఇతరులకు ఒక సీటు వచ్చే అవకాశముందని లగడపాటి జోస్యం చెప్పారు. 

Similar News