తెలంగాణ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్నారు లగడపాటి రాజగోపాల్. ఓటింగ్ శాతం చెప్పడానికి ఈసీకి ఒకటిన్నర రోజు ఎందుకు పట్టిందన్నారు. వీవీప్యాట్ లు కూడా లెక్కించాలని కోరారు. 12 సంవత్సరాల్లో మొదటిసారి నా అంచనాలు తలకిందులయ్యాయని చెప్పారు. పంచాయతీ ఎన్నికల్లో గణనీయంగా ప్రతిపక్షం బలం పెరిగిందని లగడపాటి అన్నారు. అసెంబ్లీ ఫలితాలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో.. ప్రతిపక్షం తుడిచిపెట్టుకుపోవాలి.. కానీ అలా జరగలేదని లగడపాటి అన్నారు. అనుమానాలను తీర్చడానికి వీవీ ప్యాట్లను లెక్కించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని, అయినా చాలా మంది నేతలు పార్టీల్లోకి ఆహ్వానించారని లగడపాటి పేర్కొన్నారు. ఎవరి జోక్యంతోనో.. ఎవరి ప్రోద్బలంతోనో నడిచే వ్యక్తిని కానని అన్నారు. తానెప్పుడు దొంగ సర్వేలు చేయలేదని.. ఆ అవసరం తనకు లేదని లగడపాటి స్పష్టం చేశారు. లోక్సభ ఎన్నికల తర్వాత సర్వే ఫలితాలు వెల్లడిస్తానన్నారు. ఇకపై పోలింగ్ తర్వాతే సర్వే ఫలితాలు వెల్లడిస్తానన్నారు.