బీసీలకు 34 నుంచి 22 శాతానికి రిజర్వేషన్లు తగ్గించడం దారుణం -ఆర్. కృష్ణయ్య
ఇతర రాష్ట్రాల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అన్నారు.
ఇతర రాష్ట్రాల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అన్నారు. సుప్రీం ఆదేశాలమేరకే ఆర్డినెన్స్ తెచ్చామని కేసీఆర్ చిలక పలుకులు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారని కృష్ణయ్య ఆరోపించారు. ఆత్మగౌరవ భవనాలు కాదని అధికారం కావాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పట్ల వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని, కేసీఆర్ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు తిరగబడతారని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు.