చంద్రబాబు గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు: కిల్లి కృపారాణి

Update: 2019-02-24 05:20 GMT

రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి అన్నారు. ప్రత్యేక హోదాపై రాహుల్‌ను నమ్ముతున్న చంద్రబాబు యూపీఏలో ఎందుకు చేరడం లేదని ఆమె ప్రశ్నించారు. ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీ వెంట కాంగ్రెస్‌ నడవటాన్ని జీర్ణించుకోలేకపోయానని అన్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజల కోసం కష్టపడుతున్న జగన్‌ ను చూసే వైసీపీలో చేరుతున్నట్లు కిల్లి కృపారాణి తెలిపారు. 

Similar News