కేసీఆర్ పారిపోతాడు.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

Update: 2019-04-01 06:32 GMT

ఏపీలో ఎన్నికల పొలింగ్ దగ్గరపడేకొద్ది పార్టీ అధినేతలు ప్రచార స్పీడ్ పెంచేశారు. ఒకరిపై మాటల తూటలు పేల్చుతున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కేఏ పాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేస్తే ప్రధాని నరేంద్ర మోడీ, కేసీఆర్‌కు వేసినట్టేనని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పునరుద్ఘాటించారు. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నన్నుచూస్తే కేసీఆర్ పారిపోతాడన్నారు. కేసీఆర్ ముక్కు పిండేస్తానని, కేసీఆర్‌ను ఎదుర్కొనే సత్తా కేవలం తనకు మాత్రమే ఉందని పాల్ చెప్పారు. ఇక జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ గుండు గీయించుకునే కాపుకు ఓటేస్తారా? గుండు గీయించే కాపుకు ఓటేస్తారా? అని పాల్ ప్రశ్నించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌, నాగబాబు అన్నీ ఇస్తామంటున్నారు ఎలా ఇస్తారు?అని ప్రశ్నించారు. ధనవంతురాలిని పెళ్లి చేసుకుని కట్నం తీసుకొచ్చి ఇస్తారా? అంటూ కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Similar News