పాకిస్థాన్కు చెందిన విమానాలు నిన్న భారత భూభాగంలోకి వచ్చినట్లు గుర్తించామని త్రివిధ దళాలు తెలిపాయి. పాక్ చెందిన ఎఫ్-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశామని వెల్లడించాయి. భద్రతా వ్యవహారాల కేబినెట్ సమావేశం అనంతరం త్రివిధ దళాల ప్రతినిధులు సంయుక్త మీడియా అనేక కీలక విషయాను వెల్లడించారు. పాక్ యుద్ధ విమానాల రాకను రాడార్లు గుర్తించాయని ఆ దేశానికి చెందిన ఎఫ్-16 విమానాన్ని కూల్చివేశామని ఎయిర్ వైస్ చీఫ్ మార్షల్ ఆర్జీకే కపూర్ తెలిపారు. ఎఫ్-16 శకలాలు కూడా రాజౌరి సెక్టార్లో దొరికాయని అలాగే ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనట్లు మా వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కాగా వైమానిక దాడులపై పాక్ పలుమార్లు మాట మార్చిందని త్రివిధ దళాల ఉన్నతాధికారులు మీడియాకు వెల్లడించారు.