వ్యూహాత్మకంగా అడుగు వేస్తున్న జనసేనాని

Update: 2019-03-20 04:03 GMT

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల పేర్లను ప్రకటించిన జనసేన వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీకి సిద్ధం అయ్యింది. గోదావరి జిల్లాల్లో ఎక్కువ సీట్లు గెలుస్తామని జనసేన అంచనా వేస్తుంది. భీమవరం, గాజువాక నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బరిలోకి దిగబోతున్నారు. విశాఖ ఎంపీగా సీబీఐ మాజీ జేజీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. ఇవాళ తుది జాబితా ప్రకటించనున్నారు. ఈ నెల 21న గాజువాకలో, 22న భీమవరంలో పవన్ కల్యాణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. 

Similar News