అనంతపురం జిల్లా టీడీపీలో మరోసారి వర్గవిభేదాలు భయటపడ్డాయి. రాంనగర్ బ్రిడ్జీ ప్రారంభోత్సవం కార్యక్రమం ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా మారింది. అన్నీ తానై వ్యవహరించిన ఎంపీ దివాకర్రెడ్డి బ్రిడ్జీని ప్రారంభించారు. అయితే ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి ఉన్నారని అధికారులు చెబుతున్నా ఎంపీ పట్టించుకోలేదు. దీంతో కార్యక్రమానికి ముందుగానే వచ్చిన ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరిని వెనుదిరిగారు. ఎంపీ తీరుపై మేయర్ స్వరూప ఆందోళన వ్యక్తం చేసింది.