ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ : ఊమెన్ చాందీ

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండదని తేలిపోయింది. 175 అసెంబ్లీ సీట్లు 25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఊమెన్ చాందీ, పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ప్రకటించారు.

Update: 2019-01-23 11:33 GMT

వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉండదని తేలిపోయింది. 175 అసెంబ్లీ సీట్లు 25 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ ఊమెన్ చాందీ, పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి ప్రకటించారు. అయితే జాతీయ స్థాయిలో మాత్రం టీడీపీ, కాంగ్రెస్ మధ్య అవగాహన కొనసాగుతుందని తెలిపారు. ఫిబ్రవరిలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్ర చేస్తుందని ఊమెన్ చాందీ చెప్పారు. అటు ప్రత్యేక హోదా సాధనా సమితి ఫిబ్రవరి 1న చేస్తున్న బంద్‌కు మద్దతు ఇస్తున్నట్లు రఘువీరా రెడ్డి ప్రకటించారు.

Similar News