క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు: ప్రియాంక

Update: 2019-05-15 08:05 GMT

మమతా బెనర్జీపై వివాదాస్పద ఫోటోను షేర్ చేసిన ప్రియాంకా శర్మ సుప్రీం ఆదేశాలతో జైలు నుంచి విడుదలయ్యారు. టీఎంసీ ప్రభుత్వంపై తన పోరాటం కొనసాగుతుందని ఆమె తేల్చి చెప్పారు. తాను ఎట్టి పరిస్ధితుల్లోనూ మమత బెనర్జీకి క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదన్నారు. బీజేపీ కార్యకర్తను కావడంతోనే మమత తనపై లేనిపోని కేసులు నమోదు చేశారంటూ ఆరోపించారు. బెంగాల్‌లో టీఎంసీ కార్యకర్తల ఆగడాలపై ఐదేళ్లుగా పోరాడుతున్నామని ఆమె అన్నారు. ఇకపై కూడా తమ పోరాటం కొనసాగుతుందన్నారు.   

Similar News