హైదరాబాద్‌లో భారీగా నగదు పట్టివేత

Update: 2019-04-08 12:07 GMT

ఎన్నికల వేళ రాజధానిలో భారీగా నగదు పట్టుబడుతోంది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నగరంలో అన్ని చోట్లా ప్రత్యేక పోలీసు బృందాలు ఆకస్మిక తనిఖీలు, సోదాలు నిర్వహిస్తున్నాయి. హైదరాబాద్‌ నారాయణగూడలో భారీ మొత్తంలో నగదు పట్టుబడింది. పోలీసుల తనిఖీల్లో భాగంగా 8 కోట్ల రూపాయలు లభించాయి. నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఓ జాతీయ పార్టీ కార్యాలయ నిర్వాహకుడు ఈ డబ్బులను తరలిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడి నుంచి పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.

Similar News