13 నుంచి సుప్రీంకోర్టుకు సెలవులు

Update: 2019-05-10 06:54 GMT

ఈనెల 13వ తేదీ నుండి జూన్‌ 30వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. అయితే వేసవి సెలవుల్లో అత్యవసర వ్యాజ్యాల విచారణకు ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటుల చేశారు.

- మే 13 నుంచి మే 20వ తేదీ వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం.

- మే 21 నుంచి 24 వరకు జస్టిస్‌ అరుణ్‌మిశ్రా, జస్టిస్‌ ఎం.ఆర్‌.షా ధర్మాసనం.

-మే 25 నుంచి మే 30 వరకు సీజేఐ జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ ఎం.ఆర్. షా ధర్మాసనం.

-జూన్ 3 నుంచి జూన్ 5 వరకు జస్టిస్ ఇందూ మల్హోత్రా, జస్టిస్ ఎం.ఆర్. షా ధర్మాసనం.

-జూన్ 6 నుంచి జూన్ 13వ తేదీ వరకు జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అజయ్ రస్తోగి ధర్మాసనం అత్యవసర వ్యాజ్యాలను విచారించనుంది.

ఇక జూన్ 14 నుంచి జూన్ 30 వరకు ధర్మాసనాల వివరాలు తర్వాత వెల్లడి కానున్నాయి.

Similar News