విజయవాడలో హిజ్రాలపై దాడి

Update: 2019-04-19 09:36 GMT

విజయవాడ ఇబ్రహీంపట్నంలో హిజ్రాలపై మందుబాబులు దాడి చేశారు. షాపుల దగ్గర డబ్బులు అడుక్కుంటున్న హిజ్రాలను దుర్భాషలాడి కర్రలతో వెంబడించారు. విచక్షణా రహితంగా కర్రలతో హిజ్రాలను చితకబాదారు. నలుగురు హిజ్రాలకు గాయాలయ్యాయి. తాము హిజ్రాలు అవునో? కాదో? చెప్పాలంటూ వర్మ అనే వ్యక్తి తమపై దౌర్జన్యం చేశాడని హిజ్రాలు ఆరోపించారు. ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు హిజ్రాలు.

Similar News