ఏవోబీలో మావోయిస్టు అగ్రనేతలు?

Update: 2019-05-12 06:56 GMT

ఆంధ్రా, ఒడిశా బోర్డర్‌లో మళ్లీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏవోబీలో మావోయిస్ట్ అగ్రనేతలు ఉన్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. రెండు బెటాలియన్‌ల ఎస్పీఎఫ్ దళాలు కూంబింగ్‌లో పాల్గొంటున్నాయి. ఎప్పుడైనా ఎన్‌కౌంటర్ జరిగే అవకాశం ఉండటంతో స్థానిక గిరిజనులు భయాందోళనలో గడుపుతున్నారు. కాగా సీలేరులో ఇద్దరు హోంగార్డులు మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించి, వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖ మన్యంలో హై అలర్ట్‌ కొనసాగుతోంది. 

Similar News