తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అరుదైన ఘనత సాధించారు. ఆయన హయాంలో ఇప్పటి వరకు నాలుగు ప్రభుత్వాలు ఏర్పడగా.. ఇప్పుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారంతో ఐదో ప్రభుత్వం ఏర్పడనుంది. ఇప్పటి వరకు కిరణ్ కుమార్, చంద్రబాబులతో ఒకసారి, కేసీఆర్ తో రెండు సార్లు ఆయన ప్రమాణ స్వీకారాలు చేయించారు. (రేపు) గురువారం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే నలుగురు వ్యక్తులతో ప్రమాణ స్వీకారం చేయించిన అరుదైన ఘనత గవర్నర్ నరసింహన్ కు దక్కుతుంది.