సర్వసాధారణంగా అయితే విద్యార్థులు పరీక్షా కేంద్రానికి విద్యార్థులు బస్సుల్లోనో, బైక్, సైకిల్ మీదనో వెళ్తుంటారు కదా. అలాంటిది కేరళకు చెందిన ఓ బాలిక ఏకంగా గుర్రంపై పరీక్ష కేంద్రానికి వెళ్లి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. గర్ల్ పవర్ ఇదీ అంటూ ఆమె గుర్రంపై వెళ్తున్న వీడియోను చాలా మంది సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా ఈ వీడియో షేర్ చేస్తూ ఆమె తన హీరో అంటూ బాలికపై ప్రశంసలు కురిపించారు. ఈ వీడియో గ్లోబల్గా వైరల్ కావాలని ఆశించారు. కాగా బాలిక వివరాలను తనకు ఇవ్వాలని సోషల్ మీడియా యూజర్లను ఆనంద్ మహీంద్రా కోరారు. కేరళలోని త్రిసూర్ జిల్లాకు చెందిన ఓ బాలిక తన పదో తరగతి పరీక్షకు వెళ్తున వీడియోను మనోజ్ అనే వ్యక్తి పోస్టు చేశారు.