ఉత్తరప్రదేశ్లో ఓ ఖైదీ పోలీసుల బంధీ నుండి చాలా తెలివిగా పరార్ అయ్యాడు. అయితే ఆ ఖైదీ ఓ లాయర్ హత్య కేసు, దోపిడీ కేసుతో పాటు మొత్తం పది కేసుల్లో నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ బద్దాన్ సింగ్ పోలీసుల నుండి జంప్ అయ్యాడు. గత 1996లో ఓ లాయర్ ను హత్య కేసులో బద్దాన్ సింగ్ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. కాగా ఫతేగర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బద్దాన్ను ఓ కేసు విచారణ విషయంలో గజియా బాద్ తరలించడానికి పోలీసులు ఏర్పాటు చేశారు.
అయితే మంచీ మందు దావత్ ఏర్పాటు చేశానని, బద్దాన్ తనకు ఎస్కార్టుగా వచ్చిన పోలీసులను మొళ్లిగా నమ్మించి మీరట్లోని ఓ హోటల్కు తీసుకెళ్లాడు. అక్కడ బద్దాన్ తన అనుచరులతో పోలీసులకు మందు దావత్ ఏర్పాటు చేశారు. కాగా ఇక పోలీసులు ఫుల్లుగా తాగి ఉన్నది కనిపెట్టిన బద్దాన్ అక్కడి నుండి తప్పించుకున్నాడు. కాగా ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏడుగురు పోలీసులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఈ ఏడుగురిలో ఓ ఇన్స్పెక్టర్ కూడా ఉన్నాడు.