అదో సెంటిమెంట్ : కోహ్లి సెంచరీ కొడితే విజయం మనదే ..

Update: 2019-06-05 08:16 GMT

ప్రపంచ కప్ లో భారత్ తన మొదటి మ్యాచ్ ని దక్షిణాప్రికాతో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ లో కోహ్లి సెంచరీ కొడితే కనుక ఈ మ్యాచ్ లో విజయం మనదే అని సోషల్ మీడియాలో ఓ సెంటిమెంట్ హల్చల్ చేస్తుంది.. ఇప్పటి వరకు భారత సారధి కోహ్లి రెండు ప్రపంచ కప్ లు ఆడిన సంగతి తెలిసిందే ..అందులో రెండింటిలోను మొదటి మ్యాచ్ లో కోహ్లి సెంచరీ కొట్టాడు ఇండియా విజయడంఖా మోగించింది ..

2011లో బంగ్లాదేశ్ తో మీర్ పూర్ లో జరిగిన మ్యాచ్ లో 83 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్ లో భారత్ గెలిచింది. ఇక, 2015లో ఆడిలైడ్ లో పాకిస్థాన్ తో భారత్ తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో 126 బంతుల్లో కోహ్లీ 107 పరుగులు చేశాడు. ఇక నేటి మ్యాచ్ లో కూడా ఆనవాయితీగా వచ్చిన తొలి మ్యాచ్ సెంచరీని కోహ్లీ సాధిస్తాడని, భారత విజయం కూడా ఖాయమని అభిమానులు అంటున్నారు. 

Tags:    

Similar News