సైకిలెక్కిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా..

Update: 2019-03-09 10:40 GMT

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో గుంతకల్‌ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ గుప్తా టీడీపీలో చేరారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజలందరికీ చేరువుగా ఉన్నాయని, లోటు బడ్జెట్‌ ఉన్నా రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషి చూసి టీడీపీలో చేరానని అన్నారు మధుసూదన్‌ గుప్తా. ఈ సందర్భంగా గుత్తి పట్టణ శివార్ల నుంచి అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మధుసూదన్‌ గుప్తాకు ఘనస్వాగతం పలికారు. అనంతరం సుంకాలమ్మ దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం నుండి గుత్తి పట్టణంలోకి గాంధీ చౌక్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఎన్టీఆర్‌ విగ్రహం, అంబేద్కర్‌ విగ్రహం, గాంధీ విగ్రహం, భగత్‌ సింగ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

Similar News