ఏపీ సీఎం చంద్రబాబు నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న అధికారులకు సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నోటీసులు పంపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా సీఎం సమీక్షలో పాల్గొనడంపై సీఎస్ స్పందించారు. సీఆర్డీఏ, జలవనరుల శాఖ అధికారులను వివరణ కోరారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై ఈసీ, ఏపీ సీఎస్ను వివరణ కోరింది. దీనిపై స్పందించిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సీఎం సమీక్షలో పాల్గొన్న అధికారులను వివరణ ఇవ్వాలని ఆదేశించారు.