లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదలపై గతంలో విడుదల చేసిన ఆంక్షలు ఇంకా అమల్లో ఉంటాయని ఎన్నికల సంఘం ప్రకటించింది. కోడ్ అమల్లో ఉండగా బయోపిక్ మూవీలు విడుదల చేయరాదని ఈసీ స్పష్టం చేసింది. దీంతో రేపు విడుదల కానున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్కు బ్రేక్ పడింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదలపై ఎప్రిల్ 10 న కేంద్ర ఎన్నికల సంఘం స్టే విధించింది. దీంతో ఈ సినిమాను మే 1 న విడుదల చేయాలని భావించారు. అయితే ఈ విషయంపై ఈసీ తాజాగా స్పందిస్తూ కౌంటింగ్ పూర్తి అయ్యే వరకు కోడ్ అమల్లో ఉంటుందని అప్పటివరకు ప్రజలను ప్రభావితం చేసే సినిమాలు విడుదల చేయరాదని స్పష్టం చేసింది. ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ విడుదలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే మే 1న సినిమాను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించిన వర్మ, వాయిదాపై ఎలాంటి ప్రకటనా చేయలేదు.