పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూకు ఎన్నికల సంఘం ఝలక్ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సిద్ధూకు 72 గంటలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. మంగళవారం ఉదయం 10గంటల నుంచి ఈ బ్యాన్ అమలులోకి వస్తుందని పేర్కొంది. ఈ నెల 6న బీహార్ లో ఎన్నికల ప్రచారంచేస్తూ సిద్ధూ ముస్లిం ఓటర్లంతా కలిసి మోడీని ఓడించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ కామెంట్స్పై బీజేపీ నేతల ఫిర్యాదుతో ఈసీ విచారణ జరిపింది. మతపరమైన కామెంట్స్ చేసినందుకు సిద్ధూపై బ్యాన్ విధిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది.