సిద్ధూకు ఝలక్‌

Update: 2019-04-23 05:38 GMT

పంజాబ్‌ కాంగ్రెస్‌ నేత, మాజీ క్రికెటర్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూకు ఎన్నికల సంఘం ఝలక్‌ ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు సిద్ధూకు 72 గంటలపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. మంగళవారం ఉదయం 10గంటల నుంచి ఈ బ్యాన్ అమలులోకి వస్తుందని పేర్కొంది. ఈ నెల 6న బీహార్ లో ఎన్నికల ప్రచారంచేస్తూ సిద్ధూ ముస్లిం ఓటర్లంతా కలిసి మోడీని ఓడించాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిద్ధూ కామెంట్స్​పై బీజేపీ నేతల ఫిర్యాదుతో ఈసీ విచారణ జరిపింది. మతపరమైన కామెంట్స్​ చేసినందుకు సిద్ధూపై బ్యాన్ విధిస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. 

Similar News