పుదుచ్చేరి మాజీ సీఎం, డీఎంకే నాయకుడు ఆర్వీ జానకిరామన్ (79) సోమవారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం మృతిచెందినట్ల ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఐదుసార్లు పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికైన జానకీరామన్ 1996-2000 మధ్య కాలంలో సీఎంగా వ్యవహరించారు. 1941 జనవరి 8న పుదుచ్చేరిలో జన్మించిన రామన్ రాజకీయాల్లో తనదైన ముద్రవేసుకున్నారు. జానకీరామన్ మృతికి పలువురు డీఎంకే నేతలు సంతాపం తెలిపారు.