పాక్ చెర నుంచి బయటపడి స్వదేశానికి తిరిగి వచ్చిన భారత వైమానిక దళం వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అభినందన్ను రక్షణశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ఆస్పత్రిలో కలిశారు. అయితే అభినందన్ ఐఏఎఫ్ డ్రెస్ ధరించి ఉండటం విశేషం. వైమానిక దళం చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవా కూడా మంత్రి వెంట వచ్చారు. శనివారం ఉదయమే వర్ధమాన్ తన కుటుంబ సభ్యులు, సన్నిహితులను కలుసుకున్నారు. పాక్ చెరనుంచి క్షేమంగా బయటపడ్డ వింగ్ కమాండర్ అభినంద్ రాకతో దేశవ్యాప్తంగా ఆనందోత్సాహాలు మిన్నటాయి.