జగన్‌ సమక్షంలో రేపు వైసీపీలోకి: దగ్గుబాటి

Update: 2019-02-26 07:56 GMT

 వైసీపీ పార్టీలో చేరికపై ఎట్టకేలకు స్పష్టత ఇచ్చారు సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వర్లు. తాడేపల్లిలో రేపు వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు దగ్గుబాటి వెల్లడించారు. దగ్గుబాటి మంగళవారం విజయవాడలో ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం దగ్గుబాటి మాట్లాడారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో నేను, నా కుమారుడు దగ్గుబాటి హితేష్‌ చెంచురామ్‌ ‌, ఆమంచి కృష్ణమోహన్‌ ఇంక కొంత మంది కార్యకర్తలు పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. మాట తప్పని వ్యక్తి కేవలం వైయస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రజల పట్ల జగన్‌కు ఉన్న నిబద్దత వల్లే వైసీపీ పార్టీలో చేరాలని నా కుమారుడు హితేష్ నిర్ణయించుకున్నాడని తెలిపారు.

Similar News