ఎన్నికల వేళ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి దాడి వీరభద్రరావు వైసీపీలో చేరారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు రత్నాకర్ కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. హైదరాబాద్లో జగన్ నివాసానికి వెళ్ళిన దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు వైసీపీ అధినేత సమక్షంలో పార్టీలో చేరారు. గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరిన దాడి వీరభద్రరావు కొంతకాలం తర్వాత జగన్ పార్టీకి గుడ్బై చెప్పేశారు. చివరికి మరోసారి కుమారుడు రత్నాకర్తోపాటు అదే పార్టీలో చేరారు.