లండన్లో తలదాచుకుంటున్నఆర్థిక నేరగాడు విజయ్ మాల్యాకు షాక్ తగిలింది. బెంగుళూరులో విజయ్ మాల్యాకు చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. విజయ్ మాల్యా ఫెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు న్యాయస్థానం గుర్తించింది. దీంతో మాల్యాకు చెందిన ఆస్తులను జూలై 10 తేదీలోగా అటాచ్ చేయాల్సిందిగా చీఫ్ మెట్రోపొలిటిన్ మెజిస్ట్రేట్ దీపక్ షెరావత్ తాజా ఉత్తర్వులు జారీచేశారు. కాగా ఇప్పటికే బెంగళూరు పోలీసులు దాదాపు 159 ఆస్తులను గుర్తించినట్లు న్యాయస్థానానికి అధికారులు తెలియజేశారు. గత ఏడాది మేలో ఆస్తుల ఎటాచ్మెంట్కు ఆదేశించిన కోర్టు దీనిపై పూర్తి నివేదికను అందించాలని కోరింది. ఈ కేసులో మాల్యాపై నాన్బెయిలబుల్ వారెంట్ పెండింగ్లో ఉన్న సంగతి విదితమే.