ఉగ్రదాడిని ఖండించిన సీఎం కేసీఆర్..పుట్టినరోజు వేడుకలకు దూరం

Update: 2019-02-15 06:02 GMT

కశ్మీర్ లో జవాన్లపై ఉగ్రవాదుల దాడిని తెలంగాణ సీఎం కేసీఆర్ ఖండించారు. అమరవీరులైన సైనికుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలిపారు. కశ్మీర్ ఉగ్ర దాడి నేపథ్యంలో ఈ నెల 17న తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోరాదని కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా తన బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించరాదని కోరారు. పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకుని, ఉగ్రవాదులు జరిపిన పేలుడులో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా..అనేక మంది గాయపడిన విషయం తెలిసిందే. 

Similar News