ఏపీ సీఎం చంద్రబాబు చాలాకాలం తర్వాత సచివాలయానికి వస్తున్నారు. ఈ ఉదయం 11 గంటలకు సచివాలయానికి చేరుకోనున్న చంద్రబాబు అమరావతి నిర్మాణంపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశానికి మంత్రి నారాయణతో పాటు సీఆర్డీఏ అధికారులు కూడా హాజరవుతారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు హోం శాఖపై కూడా సమీక్ష నిర్వహిస్తారు. దీనికి హోంమంత్రి చినరాజప్ప, సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఠాకూర్ హాజరవుతారు. సీఎస్గా ఎల్వీ సుబ్రహ్మణ్యం నియామకం అయ్యాక చంద్రబాబుతో సమావేశం కానుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.