59 లక్షల ఓట్ల తొలగింపు సూత్రధారి జగనే

Update: 2019-03-07 05:59 GMT

వైసీపీ అధినేత జగన్ ప్రమేయంతోనే ఏపీలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగిస్తున్నారని సీఎం చంద్రబాబు ఆరోపిస్తున్నారు. మోడీ, కేసీఆర్ అండతో చెలరేగిపోతున్న జగన్ 59 లక్షల ఓట్లను తొలగించేంకు ప్రయత్నించాడని బాబు ఆరోపించారు. ఫాం 7ను దుర్వినియోగం చేస్తున్నట్టు జగనే స్వయంగా చెప్పాడన్నారు. దేశంలో అన్ని పార్టీలకు యాప్‌లు ఉన్నట్టే టీడీపీకి కూడా ఉందన్నారు. టీడీపీ యాప్‌పైన తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 65 లక్షల మంది కార్యకర్తలు 5 లక్షల మంది సేవా మిత్రలు తమ పార్టీ సొంతమన్నారు.

Similar News