చిగురుపాటి జయరాం హత్య కేసులో శిఖా చౌదరికి జూబ్లీహిల్స్ పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. మొత్తం 388 పేజీల చార్జ్షీట్ దాఖలు చేసిన పోలీసులు ఈ కేసులో 70 మందిని విచారించినట్టు తెలిపారు. రాకేష్ రెడ్డి, శ్రీనివాస్, సూర్యప్రసాద్, కిషోర్, విశాల్, నగేష్, అంజిరెడ్డి, సుభాష్ రెడ్డిలపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. రాకేష్ రెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేసేందుకు పోలీసులు రెడీ అయ్యారు. కాగా ఈ ఏడాది జనవరి 31న జయరాం దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే.