జగన్ పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ఏపీపై విషం కక్కుతున్న మోడీ, కేసీఆర్ తో జగన్ కలిశారని ఆరోపించారు. విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడం జగన్ వైఖరి అని అన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు ప్రచార సభలో మాట్లాడిన బాబు జగన్ చెప్పేవన్నీ అబద్ధాలేనని, నిజాలంటే ఆయనకు భయమన్నారు. జగన్ కు ఓటేస్తే రాష్ట్రాన్ని తాకట్టు పెడతారని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కరెంట్ కొరత లేకుండా చేసిన ఘనత టీడీపీదేనని, చంద్రన్న బీమాను ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు.