లారీపైకి ఎగిరిపడిన కారు

Update: 2019-02-21 05:33 GMT

విజయవాడ కృష్ణలంకలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో దూసుకువచ్చిన కారు అదుపుతప్పి ఆగి ఉన్న ఆగి ఉన్న లారీపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడకు చెందిన నాగార్జున, హరీశ్‌, ప్రియాంక, మరో యువకుడు గుంటూరు నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద ఘటనలో కారులో నాగార్జున అనే యువకుడు మృతిచెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సెంటినీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో కారు 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు.

Similar News