విశాఖలో విషాదం...కారు డిక్కీలో ఊపిరి ఆడక బాలుడు మృతి

Update: 2019-05-20 15:55 GMT

విశాఖలో విషాదం చోటుచేసుకుంది. మల్కాపురంలోని నావల్‌ ఎంజీఆర్ పార్క్ క్వార్టర్స్‌లో కారు డిక్కీలో ఊపిరి ఆడక ఎనిమిదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఇవాళ ఉదయం తండ్రి కారులో సర్వీసింగ్‌ కోసం బాలుడు కూడా వెళ్లాడు. అయితే, తండ్రి ఫోన్ మాట్లాడుకుంటూ కొడుకుని మర్చిపోయి ఇంటికి వచ్చేశాడు. తీరా కొడుకు ప్రస్థావన వచ్చేసరికి అసలు విషయం తేలింది.

బాలుడు ప్రేమ్‌కుమార్ జాడ సాయంత్రం వరకూ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆఖరికి కారులో వెతకడంతో ఆ బాలుడు డిక్కీలో విగతజీవిగా పడివున్నాడు. దీంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఫోన్ నిర్లక్ష్యం ఆ బాలుడి ప్రాణాలను బలితీసుకున్నట్టు తెలియడంతో సర్వత్రా కలకలం రేపుతోంది. 

Similar News