వివేక్, సునీతాలక్ష్మారెడ్డిలకు బీజేపీ గాలం ?

Update: 2019-03-24 07:03 GMT

ఎన్నికల వేళ మంచి జోష్ మీదున్న బీజేపి. తెలంగాణలో కాస్త పేరున్న నేతలకు వలేస్తోందా? కాంగ్రెస్‌, టీఆర్ఎస్ అసంతృప్తిలను ఉక్కిరిబిక్కిరి చేయడం ద్వారా గందరగోళ పరచి, పై చేయి సాధించాలని ప్రయత్నిస్తోందా? మొన్నటికి మొన్న డీకె. అరుణా కూడా బీజేపీ గూటికి చేరింది. కాగా పార్టీలో చేరే సీనియర్ల కోసం తెలంగాణ బీజేపీ ఎదురు చూస్తుంది. పెద్దపల్లిలో మాజీ ఎంపీ వివేక్, మెదక్‌లో మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డిలు పార్టీలోకి వస్తారని భావిస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి నుంచి అభ్యర్ధిగా ప్రకటించిన కే.ఎస్. కుమార్ బి.ఫాం హోల్డ్ లో పెట్టింది తెలంగాణ బీజేపీ పెద్దలు. పెద్దపల్లి అభ్యర్ధిగా కేఎస్ కుమార్ కొనసాగుతారా లేదా వివేక్ కు బి ఫాం ఇచ్చి పోటీకి నిలుపుతారా అన్నది సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తానికి బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా అన్నది వేచి చూడాలి. 

Similar News