ఉద్రిక్తతల మధ్య అమిత్‌షా రోడ్‌షో...

Update: 2019-05-14 12:23 GMT

కోల్‌కత్తాలో బీజేపీ చీఫ్ అమిత్‌ షా రోడ్‌ షో కొనసాగుతోంది. మమత ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా బీజేపీ వాటిని ఎదుర్కొని ముందుకు దూసుకుపోతోంది. అమిత్‌ షా రోడ్‌ షోకు కొన్ని గంటల ముందు బీజేపీ నేతల చిత్ర పటాలను తొలగించడం వివాదంగా మారింది. వీటన్నింటి నడుమ సెంట్రల్ కోల్‌కత్తాలోని షాహిద్ మినార్‌ నుంచి నార్త్ కోల్‌కత్తాలో స్వామి వివేకానంద్ నివాసం వరకు అమిత్‌ షా రోడ్‌ షో కొనసాగనుంది. అమిత్‌ షా రోడ్‌ షో సందర్భంగా బీజేపీ శ్రేణులు అప్రమత్తంగా ఉన్నాయి. టీఎంసీ కార్యకర్తలు విసురుతున్న సవాళ్లకు ధీటుగా స్పందిస్తూ అమిత్‌షా రోడ్‌ షోకు ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసేందుకు బీజేపీ శ్రేణులు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి.  

Similar News