రివాల్వర్‌తో 11మందిని కాల్చిచంపానని చెప్పడం అబద్ధం

Update: 2019-01-22 11:02 GMT

అమెరికా సైబర్ నిపుణుడు సయ్యద్ సుజా చేసిన ఆరోపణలను బీజేపీ నేత కిషన్ రెడ్డి ఖండించారు. హైదరాబాద్‌లో 11మందిని రివాల్వర్‌తో కాల్చి చంపానని తదనంతరం కిషన్‌బాగ్‌లో మత కలహాలు సృష్టించడంలో పాలు పంచుకున్నానని తనపై చేస్తున్న ఆరోపణలు అర్ధం లేనివని కిషన్ రెడ్డి అన్నారు. సయ్యద్ సుజా ప్రస్తావించిన వివిధ అంశాలపై అత్యున్నత స్థాయి విచారణ జరగాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కావాలనే ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. ఈ ఆరోపణలపై రేపు మీడియా సమావేశంలో సమాధానం ఇస్తానని కిషన్‌రెడ్డి తెలిపారు.

Similar News