గుంటూరు జిల్లా టీడీపీకి భారీ షాక్ తగిలింది. ఎంపీ రాయపాటి సాంబశివరావు తెలుగుదేశం పార్టీని వీడనున్నారు. ఈ సాయంత్రం ఆయన తన అనుచరులతో కలిసి జగన్ను కలుస్తున్నారు. పార్టీలో తగిన ప్రాధాన్యమిచ్చేందుకు వైసీపీ అధిష్టానం హామీ ఇవ్వడంతో టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. టిక్కెట్ల కేటాయింపులో తమ కుటుంబానికి చంద్రబాబు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతోనే వైసీపీలోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు.