సీఐసీగా సుధీర్ భార్గవ ప్రమాణ స్వీకారం

కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్‌గా సుధీర్ భార్గవ ప్రమాణ స్వీకారం చేశారు. సుధీర్ భార్గవ చేత రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు.

Update: 2019-01-01 12:19 GMT

కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్‌గా సుధీర్ భార్గవ ప్రమాణ స్వీకారం చేశారు. సుధీర్ భార్గవ చేత రాష్ర్టపతి రామ్ నాథ్ కోవింద్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ర్టపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ హాజరయ్యారు.

సుధీర్ భార్గవతో పాటు మరో నలుగురిని సమాచార కమిషనర్లుగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 31న నియమించారు. మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి యశ్‌వర్ధన్ కుమార్ సిన్హా, మాజీ ఐఆర్‌ఎస్ అధికారి వనజ ఎన్ సర్నా, మాజీ ఐఏఎస్ అధికారి ఎన్‌కే గుప్తా, మాజీ లా సెక్రటరీ సురేశ్‌ చంద్రలను సమాచార కమిషనర్లుగా నియమించారు.

Similar News