టీడీపీ ఎంపీ అభ్యర్థుల ఖరారుఫై అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు, సినీ నటుడు బాలకృష్ణ అల్లుడు భరత్ పేరును విశాఖ ఎంపీగా ఖరారు చేయనున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో ఈ స్థానాన్ని బీజేపీతో పొత్తులో భాగంగా హరిబాబుకి కేటాయించడం జరిగింది. అయితే ఈసారి టీడీపీ సోలోగా పోటీ చేస్తున్నందున తెలుగుదేశం అభ్యర్థినే స్వయంగా రంగంలోకి దించనుంది. తనకు ఈ ఎన్నికల్లో అవకాశం కల్పించాలంటున్న బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్.