బాబ్రీ మసీదు, రామజన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును వాయిదా వేసింది. సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం మేలన్న అంశంపై నిర్ణయాన్ని వాయిదా వేసిన అత్యున్నత న్యాయస్థానం త్వరలోనే తీర్పు ప్రకటిస్తామని తెలిపింది. హిందూ వర్గాలు మధ్యవర్తిత్వాన్ని వ్యతిరేకించగా ముస్లిం సంఘాలు మధ్యవర్తిత్వానికి అంగీకారం తెలిపాయి. అయితే అయోధ్య కేసు విశ్వాసానికి సంబంధించినదనీ ఆస్తి వివాదం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్లు మధ్యవర్తుల పేర్లు సూచించవచ్చని తెలిపింది.