ఆంధ్రప్రదేశ్లో ఇవాళ్టి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలా 30 నిమిషాల నుంచి 12 గంటలా 15 నిమిషాల వరకు వరకు పరీక్ష జరగనుంది. మొత్తం 6 లక్షల 21 వేల 634 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. దీనికి సంబంధించి 2 వేల 839 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణ కోసం 156 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, 289 సిట్టింగ్ స్క్వాడ్స్ సిద్ధంగా ఉన్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీటీవీలను ఏర్పాటు చేశారు. ఇవాళ్టి నుంచి వచ్చే నెల 3 వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి.