జగన్పై హత్యాయత్నం కేసులో ఏపీ సర్కారుకు చుక్కెదురైంది. కోడి కత్తి కేసు దర్యాప్తును NIAకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. కోడి కత్తి కేసులో రాష్ట్ర పోలీసుల దర్యాప్తు చాలనీ NIA దర్యాప్తు అవసరం లేదనీ ఏపీ ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా విచారించిన హైకోర్టు పిటిషన్ను తిరస్కరించింది. అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఈ పిటిషన్కు లేనే లేదని స్ఫష్టం చేసింది. ఇక ఈ తీర్పుతో ఎన్ఐఏ విచారణ అడ్డుకోవాలని చూసిన ఏపీ సర్కార్ యత్నానికి బ్రేక్ పడింది.