ఎన్నికల యుద్దంలో అంతిమ విజయం ధర్మానిదే : చంద్రబాబు

Update: 2019-04-05 04:57 GMT

సీఎం రమేష్ ఇంట్లో పోలీసుల సోదాలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఏపీ సీఎం దాడులు కక్షసాధింపేనని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతల టెలీ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు కేంద్రంపై మండిపడ్డారు. కేవలం టీడీపీ నేతలపైనే ఐటీ దాడులు జరుగుతాయా వైసీపీ, టీఆర్‌ఎస్ నేతల ఇళ్ళల్లో సోదాలు చేయరా అని ప్రశ్నించారు. ఐటీ, ఈడీ దాడులతో టీడీపీ గెలుపును ఆపే కుట్ర చేస్తున్నారని ఆరోపించిన చంద్రబాబు ఎన్డీఏను వీడి బయటకు రావడం వల్లే టీడీపీ టార్గెట్ అయ్యిందని అన్నారు. ప్రధానికి తాను ఎదురు తిరగడం వల్లే ఆంధ్రప్రదేశ్‌పై, టీడీపీపై మోడీ, అమిత్ షా కక్ష సాధిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. బీజేపీ, వైసీపీ కుట్రలకు ప్రజలే బుద్ధి చెబుతారనీ ఎన్నికల యుద్దంలో అంతిమ విజయం ధర్మానిదేనని చంద్రబాబు అన్నారు.

Similar News