ఎలక్షన్ మిషన్ 2019పై పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల యుద్ధానికి మరో రెండు రోజులే మిగిలున్నాయని పార్టీ శ్రేణులంతా సైనికుల్లా పోరాడాలని పిలుపునిచ్చారు. మోడీ, జగన్కు ఓటమి భయం పట్టుకుందని, ఆ భయంతోనే వారిలో అసహనం పెరిగిపోయిందని చంద్రబాబు అన్నారు. వైసీపీ మేనిఫెస్టోలోనే మోడీ, కేసీఆర్లతో చంద్రబాబు బంధం బయటపడిందన్నారు. దేవుడి దయతో ప్రత్యేక హోదా సాధిస్తామని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టారని, హోదా అంటే జగన్కు ఎంత వెటకారమో ఇదే నిర్శనమన్నారు.
కేసీఆర్ భయంతోనే పోలవరం, అమరావతిని వైసీపీ మేనిఫెస్టోలో చేర్చలేదని చంద్రబాబు విమర్శించారు. నాగార్జున సాగర్, శ్రీశైలంపై పెత్తనం కేసీఆర్కు అమ్మేశారని, వైసీపీకి ఓటేస్తే ముచ్చుమర్రి, పోతిరెడ్డిపాడుకు నీళ్లురావని చంద్రబాబు చెప్పుకొచ్చారు. టీడీపీకి అండగా ఉండే వర్గాలను బీజేపీ, వైసీపీ టార్గెట్ చేశాయని ఆరోపించిన చంద్రబాబు వైసీపీ నేతలు నరరూప రాక్షసుల్లా మారారని అన్నారు. వైసీపీకి ఓటేస్తే జనాన్ని బతకనిస్తారా? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.