ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అమిత్షా మరోసారి స్పష్టంచేశారు. చంద్రబాబు, జగన్తో రాష్ట్రాభివృద్ధి జరగదన్న అమిత్షా ఒక్క మోడీతో మాత్రమే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు. వెన్నుపోటు, మోసానికి అవార్డులు ప్రకటిస్తే అందుకు ఒక్క చంద్రబాబే అర్హుడన్నారు అమిత్షా. అప్పట్లో ఎన్టీఆర్ను ఆ తర్వాత వాజ్పేయిని ఇప్పుడు మోడీని చంద్రబాబు మోసం చేశారని అమిత్షా ఆరోపించారు.