త్వరలో హుజూర్ నగర్ లో ఉప ఎన్నికలు ..

Update: 2019-05-26 04:53 GMT

త్వరలో తెలంగాణాలోని ఓక శాసనసభ నియోజకవర్గానికి గాను ఉప ఎన్నికలు జరగనున్నాయి .. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నల్గొండ నుండి పోటి చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారు . దీనితో అయన ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ లో ఉప ఎన్నికలు జరగనున్నాయి .. అయితే అక్కడి ఎన్నికలను అన్ని పార్టీలు చాలా సీరియస్ గా తీసుకున్నాయి ..

గత శాసనసభ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ అ స్థానాన్ని చాలా తక్కువ ఓట్లతో చేయిజార్చుకుంది. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని చూస్తుంది .. ఇక కాంగ్రెస్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య అయిన పద్మావతిని బరిలో దించాలని చూస్తుంది. గత ఎన్నికల్లో ఆమె కోదాడ నుండి పోటి చేసి టీఆర్ ఎస్ అభ్యర్ది బొల్లం మల్లయ్య యాదవ్ పైన ఓడిపోయారు ..

ఇక బీజీపీ కూడా గట్టి అభ్యర్ది కోసం గాలింపులు మొదలు పెట్టేసింది .. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలుచుకున్నా బీజేపి మంచి ఆత్మవిశ్వాసాని కనబరుస్తుంది .. ఈ ఎన్నికలు ఇచ్చిన ఉత్సహంతో ఉపఎన్నికలకు సిద్దం కానుంది ..  

Similar News